ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చినజీయర్ స్వామి ప్రశంసించారు. శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ..జగన్ నిబద్దతను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.
ఏపీలో అన్ని వర్గాల ప్రజలు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఇందుకు అభినందిస్తున్నానని అన్నారు. విద్య, వయస్సు, ధనం, అధికారం నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరన్నారు.
కానీ.. ఇవన్నీ ఉన్న సీఎం జగన్లో ఎలాంటి గర్వం లేదన్నారు. వైఎస్ జగన్ అందరి సలహాలు స్వీకరిస్తారన్నారు. సీఎం జగన్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు.
దివంగత నేత వైఎస్సార్ తనకు బాగా తెలుసునని.. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకముందు వచ్చి కలిశారని చినజీయర్ స్వామి తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు: సీపీఐ నారాయణ