తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారకరామరావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలులోని అద్దెంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు మాట్లాడుతూ… పేదల సంక్షేమం కోసం పాటుపడిన మహావ్యక్తి అని కొనియాడారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు
తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం పాటుపడిన మహావ్యక్తి అని కొనియాడారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు.
జనాలు రావాలని అనుకుంటున్న మహానాడుకు ప్రభుత్వం బస్సులు ఇవ్వడం లేదని వైసీపీ సర్కార్పై చంద్రబాబు మండిపడ్డారు. ఎవరూలేని యాత్రకు మాత్రం ఏసీ బస్సులు తిప్పుతుందని ఎద్దేవా చేశారు.
మహానాడుకు ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు బస్సులకు అనుమతి ఇవ్వలేదన్నారు. సభకు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా..సాయంత్రం జరిగే బహిరంగ సభకు ఎంతమంది వస్తారో చూడండి అంటూ సవాల్ విసిరారు.
తప్పుడు రాజకీయాలకు ప్రజలు ఆమోదించరని.. జగన్ ఆ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తమకు జనాలు ఉన్నారని.. వాళ్లకు బస్సులు ఉన్నాయని చంద్రబాబు కామెంట్ చేశారు