ఈరోజు పద్మశ్రీ , దర్శకధీరుడి ఎస్ .ఎస్ . రాజమౌళి 48వ జన్మదినోత్సవం .తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన దర్శక మగధీరుడు రాజమౌళి . ఈయనకు ఎన్టీఆర్ సహా పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విసెష్ తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఈ రోజు ఈయన బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ముఖ్యంగా రాజమౌళికి ఆయన ఆత్మీయ హీరో అయిన ఎన్టీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. జక్కన్నతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. హ్యాపీ బర్త్ డే జక్కన్న అంటూ ట్వీట్ చేసాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లాంటి సూపర్ స్టార్స్ తో మల్టీస్టారర్ చేస్తున్నాడు రాజమౌళి. 2021న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కూడా 300 కోట్లతో తెరకెక్కుతుంది.