ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో కొద్దిరోజుల క్రితం కరోనాతో ఓ జమాతీ మృతిచెందాడు. దీంతో అధికారులు ఆ జమాతీ కుటుంబానికి వైద్య పరీక్షలు చేసేందుకు వెళ్లారు. దీంతో వారు వైద్యులు, పోలీసులపై దాడికి దిగారు. ఈ ఘటనపై కంగనా సోదరి రంగోలి చందేల్ స్పందిస్తూ ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చలంటూ వ్యాఖ్యలు చేసింది. దీంతో రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తీసేశారు. అయితే దీనిపై కంగనా స్పందిస్తూ కొద్దిరోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పెట్టింది. సోదరి రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను తొలగించడాన్ని కంగనా తప్పుపట్టింది. అంతటితో ఆగకుండా ఆ వర్గానికి చెందిన వారు టెర్రరిస్టులంటూ పేర్కొంది. గతంలో రంగోలి చేసిన వ్యాఖ్యలకు సైతం మద్దతు తెలిపింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్ముఖ్ కంగానాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
previous post
ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో చర్చిద్దామా? : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు