telugu navyamedia
క్రైమ్ వార్తలు

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్‌లో పేలుడు : ఇద్ద‌రికి తీవ్ర గాయాలు..ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

*సికింద్రాబాద్ రాంగోపాల్ పేట‌లో పేలుడు క‌ల‌క‌లం
*భార్య‌భ‌ర్త‌ల‌కు గాయాలు..ఆస్ప‌త్రికి త‌ర‌లింపు
*పేలుడు దాటికి ఎగిరి రోడ్డుపై ప‌డిన మ‌హిళ‌

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. న‌ల్ల‌గుట్ట జే బ్లాక్‌లోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్ర‌మాదంలో ఇంట్లో ఉన్న భార్య, భర్తలుకు తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఇద్దరు నేపాల్ వాసులుగా గుర్తించారు. 20 రోజుల క్రితమే సందీప్, అను హైదరాబాద్ వచ్చారు. ఒక వస్త్ర దుఖానంలో భార్యాభర్తలు పనిచేస్తున్నారు.

పేలుడు ధాటికి భ‌వ‌నం మొద‌టి అంత‌స్తు పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. పేలుడు సంభ‌వించిన‌ప్పుడు భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.ఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు.

తొలుత ఇంట్లోని సిలిండర్ పేలిందని భావించారు . అయితే ఇంట్లో సిలిండర్ బాగానే ఉన్నట్టుగా  పోలీసులు తేల్చారు. పేలుడుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీం తనిఖీలు చేపట్టింది. పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts