రేవ్ పార్టీ కేసుకు సంబంధించి సోమవారం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణకు టాలీవుడ్ నటి హేమ తప్పించుకున్నారు.
వైరల్ ఫీవర్తో బాధపడుతున్నందున విచారణకు హాజరు కావడానికి కొంత సమయం కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నట్లు సమచారం.
ఈ నెల 19న బెంగళూరులోని జీఆర్ ఫాంహౌస్ లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
ఫామ్హౌస్పై దాడి చేసి, ఎక్స్టాసి పిల్స్, 17 ఎండిఎంఎ ట్యాబ్లెట్లు, కొకైన్ మరియు ఇతర డ్రిగ్లను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ రక్తపరీక్షలు చేయగా.. నటి హేమతో పాటు మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో వీరిని విచారించేందుకు నోటీసులు పంపించారు.
నరేశ్ గారు రేసింగ్ అనే పాయింట్స్ ఇప్పుడు వద్దు: నట్టికుమార్