telugu navyamedia
సినిమా వార్తలు

నరేశ్‌ గారు రేసింగ్ అనే పాయింట్స్ ఇప్పుడు వద్దు: నట్టికుమార్‌

టాలీవుడ్‌ హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టికుమార్ స్పందించారు. సాయిధరమ్‌ తేజ్ ను, తన కుమారుడు నవీన్ ను రేసింగ్ విషయంలో తాను హెచ్చరించానని నరేశ్ చెప్పిన నరేష్ మాటల్ని తప్పుబడుతూ.. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయవద్దని కోరారు.

ఈ నేపథ్యంలో నట్టికుమార్ మాట్లాడుతూ.. ‘‘సాయిధరమ్ తేజ్ హాస్పిటల్ నుంచి కోలుకుని వచ్చి, షూటింగ్స్ చేసుకుంటూ అందరితో మనలాగే ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం. అలాగే ఈ సందర్భంగా ఓ విషయం చెప్పదలచుకున్నాను. ఇప్పుడు రాజకీయాలు వద్దు. రాజకీయాలు చేయాలని చూడవద్దు. ఆయన క్షేమంగా బయటికి రావాలని.. సినిమా తరపున అందరం ప్రార్థనలు చేద్దాం. నరేష్ గారు మాట్లాడింది నాకైతే నచ్చలేదు. పెద్దలు నరేష్ గారూ.. మీరిప్పుడు రేసింగ్ తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆయన రేసింగ్‌ చేయట్లేదు. ఆయన మాములు డ్రస్‌లో వెళుతున్నారు. ఆయన ఇంటి నుంచి వెళుతున్నారు.

దుర్గం చెరువు బ్రిడ్జి మీద నుంచి వెళుతున్నారు. మీరు చెబుతున్నది రాంగ్. మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారని చెబుతున్నారు. మీరు చెబుతుంది రాంగ్ అని అనిపిస్తుంది. ఆయన తన ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి వస్తున్నట్లు ఉంది తప్ప.. మీ ఇంటి దగ్గర నుంచి వెళుతున్నట్లు లేదు. దయచేసి రేసింగ్ అనే పాయింట్స్ ఇప్పుడు వద్దండి. ఆయన వెళుతున్న స్పీడ్ కూడా తక్కువలోనే వెళుతున్నాడు. దురదృష్టవశాత్తూ అక్కడ ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యాడు తప్ప.. ఇంకొటి కాదు. దయచేసి ఈ విషయాలు ఇక్కడితో వదిలేసి.. ఆయన బాగుండాలని కోరుకుందాం తప్ప.. ఈ రేసింగ్ విషయాలు ఇప్పుడొద్దు. ఇద్దరూ (సాయి, మీ అబ్బాయి) ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి.. రేసింగ్ విషయాలు పక్కనెట్టి.. సాయితేజ్ గారు క్షేమంగా వచ్చి.. తిరిగి షూటింగ్స్‌లో పాల్గొవాలని కోరుకుందాం..’’ అని అన్నారు.

Related posts