అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం నేడు భూమిపూజ జరగనున్నది. ఈ మధ్యాహ్నం ఆలయ శంకుస్థాపన జరుగనుండగా, శ్రీరాముని విగ్రహం జన్మభూమిగా భావిస్తున్న ప్రాంతానికి చేర్చారు. ఇందుకు సంబంధించిన తొలి వీడియో వైరల్ అవుతోంది. అయోధ్యలో అత్యంత వైభవంగా రామాలయం నిర్మాణానికి పూజలు మొదలయ్యాయి.
శ్రీరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నేటి మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరుగనుండగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో వైపు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రోటోకాల్ ప్రకారం భద్రతను ఏర్పాటు చేశారు.