telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశంలో కరోనా విలయం..78 లక్షలకు చేరువలో కేసులు

Covid-19

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. తాజా కేసులతో దేశంలో 78 లక్షలకు చేరువయ్యాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం690 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 73,979డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,61,312 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,95,509గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 69,48,497 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,17,306 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 89.53శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో “యాక్టివ్” కేసులు 10.23 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 14,42,722 కు చేరింది.

Related posts