ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఇక ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడిచిన సమావేశాలలో వైసీపీ హామీలపై ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేతల గొంతునొక్కి, సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చారని అన్నారు. కనీస అవగాహన లేకుండా చేసిన ఆరోపణలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ముచేశాయని విమర్శించారు.
ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభూతకల్పనలు, వైసీపీ పార్టీకి చెందిన ఇతర సభ్యులు చేసిన భజన కార్యక్రమాలు జనాన్ని ముక్కున వేలేసుకునేలా చేశాయని విమర్శించారు. ప్రభుత్వ విజయాలను సభలో అంగీకరించి ఇన్నాళ్ళూ తాము చేసిన ఆరోపణలు అసత్యాలని ప్రజలకు తెలిసేలా చేశారని అన్నారు. టీడీపీ విషయాని కొస్తే, వైసీపీ హామీలపై ప్రజల తరపున నిలదీసి, ఇది మాట తప్పే ప్రభుత్వమని నిరూపించడంలో విజయం సాధించిందని అన్నారు.
వైఎస్ఆర్ కమీషన్ల వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి: దేవినేని ఉమ