ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వక్ఫ్ బోర్డు చట్టం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించి తీరాలని ఏపీ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాన్ని వైసీపీ స్పష్టంగా వ్యతిరేకించిందని, అయితే టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం దానికి మద్దతు పలికాయని ఒవైసీ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఈ చట్టాన్ని అమలు చేసిందని ఆయన మండిపడ్డారు.
ఈ చట్టానికి మద్దతివ్వడం ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ రెండు పార్టీల మోసపూరిత మాటలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా ఒవైసీ విమర్శలు చేశారు. చంద్రబాబు పదేపదే అమరావతి గురించి మాట్లాడుతున్నారని, కానీ రాజధాని నిర్మాణ పనుల్లో ఎందుకు వేగం పెంచడం లేదని ప్రశ్నించారు.


మోదీ చెబుతోన్న అసత్యాల వల్లే ఈ పరిస్థితి: రాహుల్