ఇటీవల మంగళగిరిలో చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు అనూహ్యామైన స్పందన వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో వై ,సి .పి ప్రభుత్వం అవలంభిస్తున్న క్షక్ష పూరిత రాజకీయాలు, తెలుగు దేశం పార్టీలపై , నాయకులపై దాడులకు నిరసనగా చంద్ర బాబు ఈ దీక్ష చేపట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్.. ఈ దీక్షా శిబిరంలో ఓ ప్రత్యేక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
చంద్ర బాబు నాయుడు దీక్షను విజయవంతం చెయ్యడానికి రవికుమార్ అద్దంకి నుంచి తన అనుచరులతోభారీ ర్యాలీగా వచ్చారు. చంద్ర బాబు నాయుడు చేపట్టిన దీక్ష కోసం తెలుగు దేశం శ్రేణులతో నాయకులు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు . అయితే అందరిలో గొట్టిపాటి మాత్రం ప్రత్యేకంగా కనిపించి చంద్ర బాబు మెప్పు పొందారు.
తెలుగు దేశం పార్టీ సత్తా చాటడానికి , చంద్ర బాబు నాయుడుకు అండగా వుంది దీక్షను విజవంతం చెయ్యాలనే సంకల్పంతో నాయకులూ,కార్యకర్తలతో ఎన్టీఆర్ భవన్ కిక్కిరిసిపోయింది..గొట్టిపాటి రవి కుమార్ ఆధ్వర్యంలో 300 కార్లలో కార్యకర్తలు రవి కుమార్ చంద్రబాబు దీక్ష వద్దకు తరలివచ్చారు. అద్దంకిలోని టీడీపీ కార్యాలయం నుంచి రవికుమార్ నాయకత్వంలో భారీ ర్యాలీగా మంగళగిరి చేరుకున్నారు. ఈ ర్యాలీని డ్రోన్ల ద్వారా చిత్రీకరించి యావత్ రాష్ట్రాన్ని ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తినిస్తోంది.
ఇలా కార్యకర్తలతో తన నియోజకవర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి రికార్డు సృష్టించారు. చంద్రబాబు దీక్షా శిబిరంలో ,ప్రకాశం జిల్లాలో రవికుమార్ ఇమేజ్ బాగా పెరిగింది. దీక్ష శిబిరంలో రవికుమార్ ప్రసంగం కూడా కార్యకర్తల్లో సరి కొత్త స్ఫూర్తినిచ్చింది . తెలుగు దేశం పార్టీకి ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ లాంటి నాయకుల అవసరం వుంది . చంద్ర బాబు నాయుడు కూడా రవికుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు . భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీలో రవికుమార్ ఇంకా క్రియాశీలక పాత్ర నిర్వహించే అవకాశం వుంది .
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ