ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక డీఎస్సీ గడువును ప్రభుత్వం పొడగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారంతో దరఖాస్తు స్వీకరణ గడువు ముగిసింది. తాజాగా ప్రత్యేక డీఎస్సీ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 11 వరకు గడువు పొడిగించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. ఫీజు మాత్రం 10వ తేదీలోగా చెల్లించాలని అభ్యర్థులకు సూచించారు.