ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహించనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీసెట్) ఫీజు చెల్లింపు గడువును మే 5వ తేదీ వరకు పొడిగించినట్లు ‘డీసెట్-2019’ కన్వీనర్ పి.పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తులను 6వ తేదీ వరకు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 19 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంటర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
previous post
” అమ్మ ఒడి” ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం: రోజా