ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను గురువారం వెల్లడించింది. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్సాల్సి ఉంది. కాగా జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు ఇంటర్ ప్రాక్టికట్స్ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించనున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం యధావిధిగా మార్చి 11 నుంచి 31 వరకు జరుగనున్నాయి.