ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ఫారం -7 దరఖాస్తుల వెల్లువ వివాదాస్పదం అవుతుంది. ఊహించని విధంగా లక్షలలో ఈ దరఖాస్తులు అందటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇది రాజకీయంగా కుడా పెద్ద దుమారం లేపటంతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
ఈ సిట్లో ఏడుగురు అధికారులు, ఏపీ అగ్ని మాపక సేవల విభాగం డైరెక్టర్ కె.సత్యనారాయణ నేతృత్వంలో ఉండనున్నారు. గత పది రోజుల్లో 8.74 లక్షల ఫారం-7 దరఖాస్తులు ఎలక్షన్ కమిషన్కు అందగా.. అందులో అధిక శాతం నకిలీ దరఖాస్తులేనని ఎన్నికల సంఘం అధికారులు తేల్చారు.
కేసీఆర్ మనసు బంగారం… ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు