ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అననతరం ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఒడిశా మంత్రిగా బిశ్వభూషణ్ పని చేశారు. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఛత్తీస్ గడ్ గవర్నర్ గా అనసూయ ఊకిని నియమించారు. ఇంతకాలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించిన విషయం తెలిసిందే.
previous post