తెలంగాణలో ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా… వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది.
ఈ పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ… మార్పు కోసం జరిగే యాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, వైఎస్ ఆశయాలను బాధ్యతగా తీసుకుని షర్మిల పాదయాత్ర చేయడం ఆనందంగా ఉందన్నారు. షర్మిలతో నడవడానికి తాను సిద్ధమని చెప్పారు.
8 రోజులపాటు అక్క నడుస్తున్నారని, ప్రతి ఒక్కరు తమ సమస్యలు చెబుతున్నారని, అవన్నీ ఇవాళ నేను దగ్గరుండి చూశాను. ఒక ముఖ్యమంత్రి కుతురు, మరో సీఎంకు చెల్లెలు అయిన అక్క హ్యాపీగా ఉండొచ్చు కానీ తన బాధ్యతగా భావించి వాళ్ల నాన్నగారి ఆశయాల్ని భుజంపై వేసుకుని ముందుకు నడుస్తుండడం చాలా సంతోషంగా ఉందని, ఎప్పుడూ అక్కతోపాటు నడవడానికి నేను రెడీ అని అన్నారు.
కాగా.. వైఎస్ఆర్ తన పాదయాత్ర చేపట్టిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా పాదయాత్రను ప్రారంభించింది..ఇవాళ ఎనిమిదో రోజు యాత్ర రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామం నుంచి ప్రారంభమైంది. సాయంత్రం వరకు ఎలిమినేడు గ్రామం చేరుకొని… షర్మిల అక్కడే బస చేస్తారు.