ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో భాగంగా రాష్ర్ట ప్రతినిధి బృందం పయనమైంది. నాలుగురోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఈ బృందం ఫ్రాన్స్కు బయల్దేరింది.
ఈనెల 28, 29న ఫ్రెంచ్ సెనేట్లో జరిగే యాంబిషన్ ఇండియా ఆహ్వానం మేరకు కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. పర్యటనలో భాగంగా పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో మంత్రి సమావేశమవుతారు. హెల్త్కేర్, క్లైమేట్చేంజ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు.
మంత్రి కేటీఆర్ తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఫ్రాన్స్కు వెళ్లిన.. రాష్ట్ర బృందంలో ఉన్నారు.