జమర్దస్త్ షోతో అందరికీ సుపరిచితమైన అససూయ తన నటనా జీవితంపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తోంది. స్టార్ దర్శకుడు సుకుమార్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అందరిని మెప్పింది. దాంతో అనూకి క్రేజ్ బాగా పెరిగింది. అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ అబ్బుర పరుస్తోంది. ఇటీవల ఓ తమిల సినిమాకు ఓకే చెప్పింది. అందులో స్టార్ హీరో విజయ్ సేతుపతి సరసన ఈ భామ చేయనుందట. అంతేకాకుండా తెలుగులో కూడా సునీల్ సరసన హీరోయిన్గా చేసేందుకు ఓకే చెప్పిందట. అయితే ఇప్పుడు తాజాగా ఓ మలయాళీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో స్టార్ హీరోకి జోడీగా కనపించనుందట. అతడెవరో కాదండీ మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టీ సరసన కథానాయికగా చేయనుందట. అయితే ఈ ముద్దుగుమ్మ మమ్ముట్టితో కలిసి ఇంతకు ముందే ఓ సినిమా చేసింది. యాత్రా సినిమాలో మమ్ముటి సరసన అందరిని మెప్పించింది. అయితే ఈ సారి చేయనున్న సినిమాతో మలయాళంలోకి అరంగేట్రం చేయనుంది. అంతేకాకుండా అను బాలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తుందని టాక్ నడుస్తోంది.
previous post