ఏపీ రాజధాని విషయంలో కొనసాగుతోన్న గందరగోళంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… అది జీఎన్ రావు కమిటీ కాదు జగన్ కమిటీ అని దుయ్యబట్టారు. రైతుల ఆగ్రహం చూసి జీఎన్ రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని విమర్శించారు. ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు.
విశాఖపట్నంలో నాలుగు నెలలుగా వైసీపీ నేతలు భారీగా భూములు కొన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ భూములను విజయసాయి రెడ్డి కాజేశారు. వాల్తేరులో 13 ఎకరాల భూముల కబ్జాకు విజయసాయి రెడ్డి ప్రయత్నించారు’ అని దేవినేని ఉమ ఆరోపణలు గుప్పించారు.’మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు చేతులు మారుతున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని దేవినేని డిమాండ్ చేశారు.