ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేధికగా విమర్శలు గుప్పించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికల్లోని అసలు నిజాలను తొక్కిపెట్టి, మూడు ముక్కలాట మొదలుపెట్టారని మండిపడ్డారు.రిపోర్టులు మార్చడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
ఇసుక నుంచి తైలం తీసి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన వినాశకారి ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడని జగన్ పై పరోక్ష ఆరోపణలు చేశారు. చేసిన దొంగ పనులు బయటపడతాయన్న భయంతో మండలిలో బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లగానే జగన్ ఉలిక్కిపడ్డారని లోకేశ్ ట్వీట్ చేశారు.