లాక్ డౌన్ కాలంలో కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోడీని కోరారు. వారికి పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి వెూడీకి లేఖ రాశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కరోనా వైరస్ కట్టడిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడమే కాకుండా అయా దేశాలకు వైద్య సహకారం అందిస్తున్న ప్రధానిని అభినందించారు.
‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీలో భాగంగా చేనేత వృత్తులకు , చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించాలని కోరుతూ లేఖలో రాశారు. ఈ సందర్భంగా కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి విస్తరించకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణతో పాటు దేశంలో ఉన్న చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.