స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశారు బన్నీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లు రాబట్టి రికార్డుకెక్కింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బన్నీ. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో బన్నీ నటనకు ఫిదా అయ్యారు ఆడియన్స్. అల్లు అర్జున్ మేకోవర్.. యాటిట్యూడ్ ఆకట్టుకున్నాయి.
తాజాగా అల్లు అర్జున్కు న్యూయార్క్లో అరుదైన గౌరవం దక్కింది . ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా న్యూయార్క్లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నిర్వహించిన భారీ పరేడ్కు ఆయన గ్రాండ్ మార్షల్ హో దాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ తో కలిసి హాజరయ్యారు.
దాదాపుగా ఈ పరేడ్ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తమ్ముకున్న అభిమానాన్ని చాటుకున్నారు, ఇంత స్థాయిలో ‘న్యూయర్క్ డే పరేడ్’ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ‘ఇండియా డే పరేడ్’ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.
ఆ తర్వాత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇండియా డే పరేడ్ లో గ్రాండ్ మార్షల్గా సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు ఐకాన్ స్టార్. ఈ ఫొటోతోపాటు ఆడమ్స్తో కలిసి దిగిన ‘తగ్గేదే లే’ మ్యానరిజం స్టిల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు బన్నీ.వీరిద్దరు కలిసి తగ్గేదే లే అంటున్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప 2’ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.అతి త్వరలోనే అల్లు అర్జున్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు.
అసభ్య పదజాలంతో నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు