*అమిత్ జూ.ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
*బీజేపీ విస్తరించేందుకే అమిత్ షా ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారనుకుంటా..
*చంద్రబాబుతో ప్రయోజనం లేకే.. మోదీ , అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు
కేంద్ర మంత్రి అమిత్ షా , జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ అమిత్ షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని తెలిపారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యారని భావిస్తున్నామన్నారు.
రాజకీయంగా బీజేపీకి లబ్ధిలేనిదే… ఏ ఒక్కరినీ అమిత్షా, మోడీ కలవరని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చినా మోదీ , అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కొడాలి నాని కామెంట్స్ చేశారు.