హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్తో ఫోటో సెషన్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే చివరి నిమిషంలో ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం రద్దైందంటూ గీతా ఆర్ట్స్ సిబ్బంది ప్రకటించడంతో అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. ఎన్ కన్వెన్షన్ గేట్లు విరగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు..
ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. . పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
కాగా అల్లు అర్జున్ తో పోటో సెషన్ అంటూ అభిమానులకు మేసేజ్లు వెళ్లాయి. అంతేకాదు వారికి పాస్ లు కూడా జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా అభిమానులు హైద్రాబాద్ కు చేరుకొన్నారు.
దీంతో పెద్దె ఎత్తున ఎన్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న అభిమానులు ఫోటోసెషన్ క్యాన్సిల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసులు ఉన్నా సడన్గా ప్రోగ్రాం ఎలా క్యాన్సిల్ చేస్తారంటూ ఆందోళన చేస్తున్నారు. ఫోటోలు దిగేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఇష్టమొచ్చినట్టుగా కొడతారా అని అభిమానులు మండిపడుతున్నారు