ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “మిషన్ మంగళ్”. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. 2013లో భారత్ చేపట్టిన “మంగళ్యాన్” మిషన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జగన్ శక్తి తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ ఇందులో రాకేష్ పాత్ర పోషించగా, తాప్సీ, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో అద్భుతమైన కలెక్షన్స్ను రాబట్టుకుంటోంది. విడుదలైన తొలి రోజే రూ.29.16 కోట్లు వసూలు చేసి..అక్షయ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. విడుదలైన నుంచి ఊహించని కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ సినిమా తొమ్మిది రోజులకు గానూ రూ.135.99 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మొదటి వారంతో పాటు రెండో వారంలోనూ ద్విగ్విజయంగా కలెక్షన్లను రాబడుతోంది. శ్రీకృష్ణాష్టమితో పాటు వీకెండ్ కావడంతో 150 కోట్లను సులువుగా దాటేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి అక్షయ్ కుమార్ సినిమాల్లో మొదటి తొమ్మిది రోజులకు గాను 2.0, కేసరి తొలి రెండు స్థానాల్లో ఉండగా, కేసరి రికార్డు బద్దలవడానికి మరెంతో దూరం లేదని ఈ సందర్భంగా తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
previous post