telugu navyamedia
సినిమా వార్తలు

నిత్యామీనన్ తిండిపోతు… అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

MIssion-Mangal

బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ మూవీతో బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఈ సినిమాలో నిత్యా మీనన్.. వర్షగౌడ అనే శాస్త్రవేత్త పాత్రలో నటించింది. “మిషన్ మంగళ్’ కోసం పాటుపడిన శాస్త్రవేత్తల బృందంలో ఆమె ఒకరు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తోంది. అందులో భాగంగా అక్షయ్ కుమార్ నిత్యా మీనన్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. నిత్యా మీనన్ మంచి నటి అని చెప్పడమే కాదు… వివిధ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు వచ్చిన అవార్డుల గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు నిత్యా మీనన్ కు భోజనం అంటే ఎంత ఇష్టమో కూడా చెప్పుకొచ్చాడు. తిండి కోసం ఆమె ఎంతగా ఇబ్బంది పెట్టేదో కూడా చెప్పాడు. నిత్యాకు ఏం కావాలో నేరుగా తనకే ఆర్డర్ చేసేదన్నారు. అంతేకాదు తన బతుకు డబ్బావాలా బతుకు చేసిందని అన్నాడు. ‘రేపు నాకు పాలక్ పనీర్ కావాలి… ఇది కావాలి అది కావాలని అడిగేది’ అన్నాడు. నిత్యా ఒక్కరే కాదు… సినిమాలో నటించిన మహిళలంతా అలాగే చేశారని… తనతో బ్రేక్ ఫాస్ట్ కూడా తయారు చేయించేవారని… తనతో ఇలా చేయించేందుకు సిగ్గులేదా అని కూడా అన్నాడు. అక్షయ్ సరదాగా అన్న ఈ మాటలకు అందరూ సరదాగా నవ్వుకున్నారు.

Related posts