దివంగత నేత, మాజీ సీఎం రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా చేసుకొని, సూపర్ స్టార్ మమ్ముట్టి వై.ఎస్.ఆర్ గా, మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్తో నడుస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మమ్ముట్టి నటనే హైలైట్ అని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయ కూడా నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు సుచరితా రెడ్డి. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనసూయ.. ‘నేను ఛస్తే నువ్వు భయపడాలి.. నేను బతికుండా.. ఎందుకు భయం’ అంటూ మమ్ముట్టి తనతో చెప్పిన డైలాగ్ను పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా దర్శకుడు మహి వి. రాఘవ్కు అనసూయ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘యాత్ర’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టిని ప్రశంసలతో ముంచెత్తారు.
‘సుచరితా రెడ్డి పాత్రను చిరకాలం గుర్తుపెట్టుకుంటాను. ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి ఈ పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు మహి వి. రాఘవ్కు, నిర్మాత విజయ్ చిల్లాకు ధన్యవాదాలు. మమ్ముట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. వైఎస్సార్ పాత్రలో నటించి, మాకు అప్పటి రోజులను మళ్లీ గుర్తుచేశారు. ‘యాత్ర’ సినిమా చూసినప్పుడల్లా ఆయన ఉన్నప్పటి రోజులు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఒక లెజెండ్ మరో లెజెండ్ పాత్రలో నటించిన విధానాన్ని మీరూ చూడండి’ అని పేర్కొంటూ తన పాత్రకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ట్వీట్పై దర్శకుడు రాఘవ్ స్పందిస్తూ.. ‘మా ఆడబిడ్డకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
“Nenu chaste nuvvu bhayapadali.. nenu bratikunda enduku bhayam..”
🙏🏻🙏🏻🙏🏻
Experience one legend playing the other in a way inevitable!! #YatraTheMovie #YatraFrom8thFeb #YSR sir #Mammootty sir #SucharitaReddy @MahiVraghav @70mmEntertains pic.twitter.com/B0k1DALIgW— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 10, 2019