telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడివి శేష్ ‘ఎవరు’ … సెన్సార్ పూర్తి …

adavisesh movie yevaru censored

దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’ లో అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించించారు. ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ పొందింది.

భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్ నిర్మిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Related posts