దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’ లో అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించించారు. ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు విశేష స్పందన లభించింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ పొందింది.
భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్ నిర్మిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు.