సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకొన్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్ళే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాగా ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది. వైసీపీలో చేరే సినీ నటుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే అలీ, పృథ్వి, కృష్ణుడు, భానుచందర్, జయసుధ వంటి నటులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు రాజారవీంద్ర వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఉదయం ముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణిలతో పాటు నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరిని వైసీపీ అధినేత జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
previous post
next post