సాధరణ ఎన్నికల్లాగే తలపించిన ‘మా’ ఎన్నికల ఎపిసోడ్ క్లైమాక్స్కి చేరింది. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. బరిలో ఉన్న అభ్యర్థులు మంచు విష్ణు, ప్రకాశ్రాజ్లు తమ ప్యానెళ్లతో కలిసి ముమ్మర ప్రచారాన్ని మొదలుపెట్టాయి గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సారి మా అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు ఒకరిపై ప్రెస్మీట్లు పెట్టి ఒకరుపై ఒకరు చేసుకుంటున్నారు.
రేపు (అక్టోబర్) 10న మా ఎన్నికలు కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగం చేశారు. తనయుడు విష్ణుని గెలిపించుకునేందుకు విలక్షణ నటుడు మోహన్బాబు మోహన్ బాబు శతివిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోహన్బాబు మా ఎన్నికలపై తనదైన స్టైల్లో ఓ ఆడియో రిలీజ్ చేశారు.
అందరికీ నమస్కారం..47 సంవత్సరాల నుంచి నటుడిగా, నిర్మాతగా మీరందరూ ఆశీర్వదిస్తున్న మీ మోహన్బాబుని. తెలుగు నటీనటులందరూ ఒక్కటిగా ఉందామని, అతిరధ మహారథులు పెట్టింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా వెళ్దామని అప్పటి పెద్దలు కోరుకునేవారు. కానీ ఇప్పుడు కొందరు బజారున పడి నవ్వులపాలవుతున్నారు. మనసుకు కష్టంగా ఉంది. ఎవరు ఎన్ని చేసినా ‘మా’ ఒక కుటుంబం. మీ ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. కానీ ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి.
మీ ఓటు.. మా అధ్యక్షుడిగా పోటీచేస్తున్న మీ కుటుంబ సభ్యుడు మంచు విష్ణు, అతడికి ప్యానెల్కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాటను విష్ణు నెరవేరుస్తాడని నాకు నమ్మకం ఉంది. విష్ణు ప్యానెల్ గెలిచిన వెంటనే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి.. మన కష్టసుఖాలు చెప్పుకొని సహాయ సహకారాలు తీసుకుందాం. బిడ్డను ఆశీర్వదించండి” మోహన్బాబు ఆడియోలో చెప్పారు. దీంతో ఫిలింనగర్ సర్కిల్స్లోనే కాదూ తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.
ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు