బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అనేకమందిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇద్దరు ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు పంపింది. సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిలో ఒకరైన భూషణ్ బెల్నేకర్కు, బాంద్రా పోలీస్ స్టేషన్ ఎస్ఐకి సీబీఐ సమన్లు పంపింది. ఇప్పటికే సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన బాంద్రా పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన ఆధారలన్నింటినీ సీబీఐ ఇప్పటికే సేకరించింది. ఇప్పటివరకూ సుశాంత్ కేసులో ముంబై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేశారని మహారాష్ట్ర సీఎంతో సహా ఆ రాష్ట్ర మంత్రులు, శరద్ పవార్ కూడా చెప్పిన నేపథ్యంలో ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ముంబై పోలీసులు కేసు నుంచి రియా చక్రవర్తిని ఉద్దేశపూర్వకంగా తప్పిస్తున్నారంటూ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
previous post
అన్నయ్య సినిమాలు వరుణ్ రీమేక్ చేస్తే పెద్ద సవాలే..!