జగనన్న విద్యా కానుక అమలుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద విద్యార్థులకు 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్ ను విద్యార్ధులకు పంపిణీ చీయనున్నారు. వచ్చే నెల 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ అనుమతి ఉన్న మదర్శాల్లో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించేందుకు జగనన్న విద్యా కానుక పథకం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మోదీ, యోగిల డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వల్ల ఘర్షణలు: మాయావతి