telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గోపీచంద్ సినిమాకు బ్రేక్… అడ్వాన్స్ వెనక్కి…!

gopichand

మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవల ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడు. దీనికి తమిళ దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా నిర్మించనున్నట్టు వార్తలొచ్చాయి. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఇంతలోనే ఈ చిత్రం ఆగిపోయినట్టు, నిర్మాత నుంచి అడ్వాన్సుగా తాను తీసుకున్న రెండు కోట్లను గోపీచంద్ తిరిగి ఇచ్చేసినట్టు టాలీవుడ్ లో తాజాగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ చిత్రం ఎందుకు ఆగిపోయిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Related posts