మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలోనూ చిరు అభిమానుల్ని అలరించనున్నారు. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయనకు అందాల భామ జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది.
ఈ సినిమాలో తండ్రితనయులు ఇద్దరు అడపాదడపా పలు చిత్రాల్లో కలిసి నటించినా ఇలా పూర్తి స్థాయిలో కనిపిస్తుండడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమైంది.
రామ్ చరణ్, పూజా హెగ్డేల మధ్య చిత్రీకరించిన నీలాంబరి అనే పాటను విడుదల చేయనున్నారు. ‘నీలాంబరి’ అంటూ సాగే బ్యూటీ ఫుల్ మెలోడీని దీపావళి కానుకగా నవంబర్ 5వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మణిశర్మ సంగీతంలో మెలోడీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు. ఇక ఈ విషయాన్నీ తెలుపుతూ చరణ్, పూజా పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో పూజా చేతిలో పిల్లనగ్రోవి పట్టుకోగా, చెర్రీ వెనకాల నుంచి పూజాను హత్తుకున్న ఫోటో రొమాంటిక్గా ఉంది. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న విడుదల కానుంది.
పొలిటికల్ ఎంట్రీపై కంగనా కామెంట్స్