నటుడు అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ సినిమా తర్వాతే ఒక నటుడిగా ఎదిగిన భావన కల్గిందని అన్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన చిత్రం కావటంతోనే అది సాధ్యం అయ్యింది. రుక్సార్ కథానాయిక కాగా, సురేష్బాబు ఈ చిత్రాన్ని సమర్పించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ అందుకోవడం ఆనందంగా ఉందని చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ”ఏబీసీడీ’ సినిమాకు (బాక్సాఫీసు వద్ద) నా కెరీర్లోనే ఉత్తమ ఓపెనింగ్స్ వచ్చాయి. ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల కంటే ఉత్తమంగా ఓపెన్ అయ్యింది. ప్రతి షోకు కలెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి.
మధుర శ్రీధర్గారు కోరుకున్నట్లు ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా కలెక్షన్స్ను దాటాలని నేను కోరుకుంటున్నా. నాకు మంచి సినిమా ఇచ్చిన మధుర శ్రీధర్గారికి, ఎక్కువ థియేటర్స్ ఇచ్చి విడుదల చేయించిన సురేష్బాబుగారికి థాంక్స్. సంజీవ్ ఇందులో నన్ను కొత్తగా ప్రెజెంట్ చేశారు. అందరూ బాగున్నానని, బాగా చేశానని అంటున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం సంజీవ్కే దక్కుతుంది. ఇప్పటి వరకు నా సినిమాకు ఇంత మంచి స్పందన రాలేదు. నాకు ఆర్టిస్ట్గా ఎదిగిన ఫీలింగ్ కలిగింది. ఈ పాత్రలో నటిస్తున్నంత సేపు బాగా ఎంజాయ్ చేశా. ఈ వేసవిలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది ఫర్ఫెక్ట్ చిత్రం’ అని అన్నారు.
బిత్తిరి సత్తిపై శివజ్యోతి కామెంట్స్… ఏమందంటే ?