పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైన “36 వయోదినిలే” చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల జ్యోతిక “రాట్చాసి” అనే సినిమాలో పాఠశాల ప్రిన్సిపల్ ఆఫీసర్ పాత్ర చేసింది. గౌతమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భారతదేశంలోని పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారు. ఈ చిత్రాన్ని ఇటీవలే మలేషియా విద్యాశాఖ మంత్రి మాస్లీ మాలిక్ వీక్షించారు. సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాలని అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులను తీసుకురావడానికి దర్శకుడు ప్రదర్శించిన అనేక అంశాలను ఆయన చర్చించారు. జ్యోతిక తన మరిది కార్తీతో కలిసి ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా, జ్యోతికతో “పాపనాశం” తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆన్సన్ పాల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారట. గోవింద్ వసంత్ చిత్రానికి సంగీతం అందించనుండగా, సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తీ, జ్యోతిక సోదరుడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ ఏడాది అక్టోబర్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. “పొన్మగల్ వందాల్” అనే టైటిల్తో తెరకెక్కనున్న చిత్రంలోను జ్యోతిక నటించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సీనియర్ దర్శక నటులు భాగ్యరాజ్, పాండియరాజన్, పార్తిబన్లు ముఖ్యపాత్రలు పోషిస్తుండటం విశేషం. ప్రతాప్ పోతన్ కీలకపాత్రలో కనిపిస్తారు. జేజే ప్రట్రిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సందేశాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం సమకూర్చుతున్నారు.
previous post
శ్రీదేవి చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు : మాధురీ దీక్షిత్