తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో కాంట్రాక్టులు, కమీషన్లు, కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి అబద్ధాల సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. కేసీఆర్ కుటంబం నుంచి తెలంగాణను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
కేసీఆర్ నాలుగేళ్ల కన్నా ఎక్కవ కాలం పాలించరని రాజనర్సింహ జోస్యం చెప్పారు. 2022లోనే ఎన్నికలు వస్తాయని, ప్రధాని మోదీ, కేసీఆర్లకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ గెలవాలని ఆ పార్టీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.