ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రం కౌంటర్ బాధ కలిగించిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంశమని కేంద్రం చెప్పడంపై ఆయన స్పందించారు.
ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ లో ఉన్న అంశాలు కొన్ని మనసుకు బాధ కలిగించేవిగా ఉన్నాయన అన్నారు. అంతమాత్రం చేత కలత చెందాల్సిన అవసరంలేదని తెలిపారు.
కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ లో కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు వివరించారు. రాష్ట్రం తీసుకువచ్చిన సీఆర్డీయే రద్దు చట్టం గురించి తమకు చెప్పలేదన్న నిజాన్ని కేంద్రం వెల్లడించిందని అన్నారు. చెప్పివుంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకుని ఉండేదోనని వ్యాఖ్యానించారు.
ఇలా చేస్తే జనాభా నియంత్రణ సాధ్యం: బాబా రాందేవ్