లోక్ సభ నియోజకవర్గం వెల్లూరు కు ఈ నెల 18న జరగనున్న ఎన్నిక వాయిదా పడింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
ఈ నియోజకవర్గంలో ఇటీవల భారీ నగదును సీజ్ చేశారు. వెల్లూరు డీఎంకే అభ్యర్థి కదిరి ఆనంద్ కు చెందిన గోదాంలో 11.53 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పోలింగ్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిన్న రాత్రి ఈసీ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు, రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఎన్నిక రద్దు అయింది.
బికినీ వేసుకొని నన్ను నేను చూసుకోలేను… స్టార్ హీరోయిన్ కామెంట్స్