దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సందర్భంగా హైద్రాబాద్ లో పతాకావిష్కరణ చేశారు. చిరుజల్లుల నడుమ తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య ఉద్యమ మహనీయులకు నివాళులు అర్పించారు.
నారా లోకేశ్ కూడా తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి పతాకావిష్కరణలో పాల్గొన్నారు. మహోన్నత దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు పోరాడిన స్వాతంత్ర సమరవీరులు, ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఇవాళ మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వారిచ్చిన కానుక అంటూ ట్వీట్ చేశారు.
రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయంపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.. దత్తత్రేయ డిమాండ్