telugu navyamedia
రాజకీయ

పిల్లలకు మన సంస్కృతి గురించి చెప్పాలి: రాజ్‌నాథ్‌

Central Home Minister Rajnath Singh India
జీవితంలో ఏ దశలోనైనా విలువలకు కట్టుబడి బతకడం విద్యార్థులకు నేర్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ టీచర్లను కోరారు. గ్రేటర్‌ నోయిడాలోని కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం క్యాంపులో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి హోంమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాల్లోని పాఠాలను చెప్పడంతో పాటు  పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించాలన్నారు.
బోధనను కేవలం జ్ఞానాన్ని అందించడానికి పరిమితం చేయకుండా విలువల గురించి కూడా విద్యార్థులకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.మెరుగైన సమాజం కోరుకునే ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి  బతకాల్సిందేనని చెప్పారు. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

Related posts