పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తాజాగా ఇండియన్ టీం మాజీ ఆటగాడు, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని పొగడ్తలతో ముంచెత్తాడు. తాజాగా అక్తర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా భారత్-పాక్ జట్లకు ఆడుతున్న రోజుల్లోని ఫోటోను షేర్ చేస్తూ “నాకు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాలంటే చాలా ఇష్టం. నేను ఆడే రోజుల్లో ఏ జట్టు మీదైనా పోటీపడేందుకైనా సిద్దపడేవాడిని. అలాగే నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థుల్లో గంగూలీ ఒకరు. అతను కేవలం బలమైన ప్రత్యర్థే కాదు.. అంతకుమించిన కెప్టెన్ కూడా… నేను ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అతని కెప్తెన్సీలో ఆడినందుకు సంతోషపడుతున్నాను ” అని అక్తర్ పేర్కొన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ మొదటి సీజన్ లో మాత్రమే ఆడాడు ఈ ఫాస్ట్ బౌలర్. ఆడిన అయిదు మ్యాచ్ లో మొత్తం అయిదు వికెట్లు తీశాడు. ఇక గంగూలీ విషయానికి వచ్చేసరికి మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కొని సతమతం అవుతున్నసమయంలో జట్టు పగ్గాలను తీసుకున్నాడు గంగూలీ. తన నాయకత్వంలో భారత జట్టు అనేక విజయాలను అందుకుంది. ఇక జహీర్ ఖాన్, యువరాజ్, ధోని, హర్భజన్ సింగ్ లాంటి యువ క్రికెటర్ లను బాగా ఎంకరేజ్ చేశాడు గంగూలీ.
previous post