బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెపోటిజంపై ఘాటుగానే స్పందించింది. ప్రముఖులందరిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా స్టార్ హీరోయిన్ దీపికాపదుకునే పై విమర్శలు చేసింది. ఆమె ఒక సైకో అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు యంగ్ హీరో రణబీర్ కపూర్ ఒక రేపిస్ట్ అంటూ వ్యాఖ్యలు చేసింది. “ప్రతిరోజు అమ్మాయిల వెంట పడే రణబీర్ ను ఎవరూ రేపిస్ట్ అని పిలవరని కంగన చెప్పింది. తనను తాను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా దీపిక ప్రకటించుకుందని… అయినప్పటికీ ఆమెను ఎవరూ సైకో, రాక్షసి అని పిలవరని విమర్శించింది. సాధారణ కుటుంబాల నుంచి, చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి మాత్రం ఇలాంటి పేర్లు పెడతారు” అని కంగనా మండిపడింది.
previous post
next post