లెబనాన్ రాజధాని బీరూట్లో నిన్న జరిగిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 78కి చేరింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. లెబనాన్కు తమ దేశం తోడుగా ఉంటుందని అన్నారు. ఆ దేశానికి ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదని, ఈ ఘటన భయంకరమైన దాడిలా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ పేలుళ్లపై తన యంత్రాంగంలోని కొంతమంది అత్యుత్తమ జనరల్స్తో మాట్లాడానని, తనతో వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. తాము గతంలో స్వాధీనం చేసుకున్న ఓ నౌకలోని పేలుడు పదార్థాలను పోర్టు ఏరియాలో నిల్వ చేశారని, వాటి వల్లే ఈ ఘటన సంభవించినట్లు లెబనీస్ జనరల్ సెక్యూరిటీ చీఫ్ అబ్బాస్ ఇబ్రహీం కూడా వెల్లడించారు.