బీజేపీ ని వీడి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అనుకున్నదే తడవుగా పవన్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. దీనితో బీజేపీకి రాజీనామా చేసేసి, తన బలం, బలగంతో జనసేనలో చేరేందుకు సన్నద్ధం అయ్యాడు. దానిలో భాగంగానే, నేడు ఆకుల సత్యనారాయణ, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకుని, విజయవాడలో ఉన్న పవన్ కల్యాణ్ ను కలిసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఆయన వెంట వందలాది వాహనాల్లో అనుచరులు, స్థానిక నేతలు కూడా బయలుదేరారు.
నిన్న ఆకుల తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపించగా, ఇంకా ఆయన ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరికాసేపట్లో తన అనుచరులతో కలిసి ఆకుల, జనసేన కండువాను కప్పుకోనున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు మీడియాతో ఆకుల మాట్లాడుతూ, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే, అక్కడి నుంచి పోటీ చేస్తానని, రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన ఆయనతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఇంతా చేసేది రేపటి సీటు కోసమే, మరి అది వారించినా.. అనేది చూడాల్సి ఉంది.