telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలి: ఉత్తమ్

uttam congress mp

మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిన్న పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. దుబ్బాక అసెంబ్లీ నేతలతో ఆయన ఉప ఎన్నికపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కొట్టే దెబ్బకు కేసీఆర్ దిమ్మ తిరగాలని అన్నారు.

ఈ ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి టీఆర్‌ఎస్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొడదామన్నారు. మూడు రోజుల్లోగా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీలు పూర్తి చేయాలని కోరారు. అలాగే, మరో వారంలో అన్ని గ్రామాల్లో పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి చేసి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలన్నారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నేతలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Related posts