బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ది ఆత్మహత్య కాదు… ఇది ప్రణాళికాబద్దంగా జరిగిన ఓ హత్య అంటూ బాలీవుడ్పై మండిపడిన విషయం తెలిసిందే. ఎటుంటి నేపధ్యం లేకుండా ఎదుగుతున్న సుశాంత్ పట్ల బాలీవుడ్ ప్రముఖులు వివక్షత చూపారని ఆరోపించారు. అలాగే సుశాంత్ ఆత్మహత్యకు అతని బలహీనమైన మనసు కారణం అని రాస్తున్న మీడియాపై ఆమె ఫైర్ అయ్యారు. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ డిజైనర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది కంగన. తనను మీడియా దూరం పెట్టేలా ‘నిషేధించారు’ అంటూ… ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ `వోగ్` తనకు ఐదేళ్ల పాటు సహకరించ లేదని కంగన పేర్కొంది. దానికి కారణం మ్యాగజైన్ ఫ్యాషన్ డైరెక్టర్ కం డిజైనర్ అనిత ష్రాఫ్ అదజానియా.. కరణ్ జోహార్ కు ఎంతో సన్నిహితులు. కరణ్ ప్రేరేపించి తనని దూరం పెట్టేలా చేశాడని క్వీన్ ఆరోపించారు.ఇండస్ట్రీలో హృతిక్ ఫ్యామిలీ, వైఆర్.ఎఫ్ ఫ్యామిలీ, ఖాన్ లతో సహా భట్స్ కుటుంబాల్ని కంగన ఇదివరకూ పలు సందర్భాల్లో తప్పుపట్టిన విషయం తెలిసిందే.
previous post