టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల, సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
తాజాగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో ‘స్టాండప్ రాహుల్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కూర్చుంది చాలు అనేది ట్యాగ్లైన్. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం వినోదాత్మకంగా కట్ చేశారు..
‘మా బాస్ ఏ పనైనా రెండే నిమిషాల్లో చేస్తాడట’ అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ డైలాగ్ను స్టాండప్ కమెడియన్గా రాజ్ తరుణ్ పలకడం వినోదాత్మకంగా ఉంది. ఆద్యంతం కామెడీ, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పలు సంభాషణలు బాగా అకట్టుకుంటున్నాయి.
ఇందులో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ట్రైలర్లో ప్రకటించారు.